
బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్పై ఉత్తరప్రదేశ్లోని లక్నోలో బుధవారం ఎఫ్ఐఆర్ నమోదైంది.గౌరీ బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న రియల్ ఎస్టేట్ కంపెనీ, తన నుంచి రూ. 86 లక్షలు వసూలు చేసినప్పటికీ ఫ్లాట్ను అప్పగించలేదని ఆరోపిస్తూ ముంబైకి చెందిన జస్వంత్ షా అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న గౌరీ ప్రభావంతోనే తాను ఆ ఫ్లాట్ను కొనుగోలు చేశానని జస్వంత్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో గౌరీపై భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ) సెక్షన్ 409 (నేరపూరిత విశ్వాస ఉల్లంఘన) కింద పోలీసులు కేసు నమోదు చేశారు. గౌరీతో పాటు తులసియాని కన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ లిమిటెడ్ సీఎండీ అనిల్ కుమార్ తులసియానీ, డైరెక్టర్ మహేశ్ తులసియానిపై కూడా ఫిర్యాదు చేశారు.