మాజీ మంత్రి తలసానిపై ఎస్‌‌ఆర్‌‌ నగర్‌‌ పీఎస్‌‌లో కేసు నమోదు

మాజీ మంత్రి తలసానిపై ఎస్‌‌ఆర్‌‌ నగర్‌‌ పీఎస్‌‌లో కేసు నమోదు

పంజాగుట్ట, వెలుగు: మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్​పై ఎస్ఆర్ నగర్​పోలీస్ స్టేషన్​లో కేసు నమోదైంది. సీఎం రేవంత్ రెడ్డిపై ముక్కలు ముక్కలు చేస్తామంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేయడంతో ఎస్ఆర్ నగర్​కు చెందిన కాంగ్రెస్ నేత తలసానిపై ఈ ఫిర్యాదు ఇచ్చారు. ఈ మేరకు ఎస్ఆర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశామని తెలిపారు.