రాజస్థాన్లో దారుణం జరిగింది. భరత్ పూర్కు చెందిన డాక్టర్ దంపతులను బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగులు కాల్చి చంపారు. ఈ దారుణ ఘటన శుక్రవారం సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్య జరిగింది. డాక్టర్ దంపతులు కారులో వెళ్తుండగా.. దుండగులు వారి కారును ఓవర్ టేక్ చేసి బైక్ అడ్డుపెట్టారు. ఆ తర్వాత కారు డ్రైవింగ్ సీటు దగ్గరికి వెళ్లి ఒక్కసారిగా కాల్పులు జరపడంతో డాక్టర్ దంపతులు స్పాట్లోనే చనిపోయారు. అనంతరం నిందితులు బైక్ మీద పారిపోతూ.. గాలిలోకి కూడా కాల్పులు జరిపారు. డాక్టర్ దంపతులు 2019లో జరిగిన ఓ యువతి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే కాల్పులు జరిపిన వ్యక్తుల్లో ఒకరు యువతి సోదరుడిలా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. దాడికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. నిందితుల కోసం గాలిస్తున్నామని భరత్పూర్ పోలీసులు తెలిపారు.
Law & Order Situation in Congress Ruled Rajasthan.... But No one will Speak
— Megh Updates ? (@MeghUpdates) May 28, 2021
Doctor Husband and Wife K!lled in Broad Daylight in Bharatpur , Rajasthan pic.twitter.com/leEtdoUqD1