
సీబీఎస్సీ 10వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి..మంగళవారం ( మే 13 ) సీబీఎస్సీ ఎగ్జామినేషన్ కంట్రోలర్ శాన్యం భరద్వాజ్ ఫలితాలను అనౌన్స్ చేశారు. ఈ ఏడాది పదవ తరగతిలో 93.60శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాది కంటే ఈ ఏడాది 0.06 శాతం ఉత్తీర్ణత పెరిగింది. ఈ ఏడాది కూడా బాలికలదే పైచేయి కావడం గమనార్హం. అబ్బాయిల కంటే అమ్మాయిలు 2.37శాతం ఎక్కువ పాయింట్లతో ముందంజలో ఉన్నారు. 95శాతం మంది బాలికలు ఉత్తీర్ణులు కాగా.. 92. 63శాతం మంది బాలురు ఉత్తీర్ణులయ్యారు.
తిరువనంతపురం, విజయవాడలో అత్యధికంగా 99.79% ఉత్తీర్ణత శాతం నమోదయ్యింది, తర్వాతి స్థానాల్లో బెంగళూరు 98.90శాతం, చెన్నై 98.71 శాతం నమోదయ్యింది. జవహర్ నవోదయ విద్యాలయాల విద్యార్థులు 99.49శాతం ఉత్తీర్ణత శాతం సాధించగా.. పాఠశాలల్లో అత్యధికంగా కేంద్రీయ విద్యాలయాల విద్యార్థులు 99.45శాతం ఉత్తీర్ణత సాధించారు.
Central Board of Secondary Education (CBSE) declares Class X results.
— ANI (@ANI) May 13, 2025
CBSE Class X results: 93.60% of students pass the board exams. Passing percentage increased by 0.06% since last year.
Girls outshine boys by over 2.37% points; 95% girls passed the exam. pic.twitter.com/mveEwovbIC
Also Read : సీబీఎస్సీ 12వ తరగతి ఫలితాలు విడుదల
ఈ ఏడాదికి సంబంధించి దేశవ్యాప్తంగా 7 వేల 842 సెంటర్లలో పరీక్షలు నిర్వహించింది సీబీఎస్సీ. 10, 12వ తరగతుల పరీక్షలకు ఈ ఏడాది సుమారు 42లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. దీంతో పాటు 26 దేశాల్లో కూడా పరీక్షలు నిర్వహించింది సీబీఎస్సీ. ఓవరాల్ గా ఈ ఏడాది 10వ తరగతి పరీక్షలకు 24.12 లక్షల మంది హాజరు కాగా.. 12వ తరగతి పరీక్షలకు 17.88 లక్షల మంది హాజరయ్యారు.
ఫలితాల కోసం https://cbseresults.nic.in/ క్లిక్ చేయండి