న్యూఢిల్లీ, వెలుగు: మొన్న వానాకాలం సీజన్ లో తెలంగాణ నుంచి 70 లక్షల 22 వేల టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇందుకోసం రూ. 13,763 కోట్ల ఎంఎస్పీని చెల్లించామని, రాష్ట్రంలో 10,62,428 మంది రైతులకు ప్రయోజనం చేకూరిందని పేర్కొంది. 2021–-22 వానాకాలం సీజన్ లో దేశవ్యాప్తంగా 741.62 ఎల్ఎంటీల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపింది. పంజాబ్, చత్తీస్ గఢ్, తెలంగాణ, ఏపీ, గుజరాత్, మధ్య ప్రదేశ్ సహా 24 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి ఈ ధాన్యం కొనుగోలు చేసినట్లు వివరించింది. ఇందుకోసం రూ.1,15,358 కోట్ల మద్దతు ధరతో దేశవ్యాప్తంగా 105.14 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరిందని కేంద్రం తెలిపింది. ఈ మేరకు కేంద్ర ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం... ధాన్యం సేకరణలో పంజాబ్ ఫస్ట్ ప్లేస్లో ఉండగా, చత్తీస్ గఢ్ సెకండ్ ప్లేస్ లో ఉంది. తర్వాత మూడోస్థానంలో తెలంగాణ నిలిచింది. పంజాబ్ నుంచి 1,87,28,335 టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా, చత్తీస్ గఢ్ నుంచి 92,01,000 టన్నుల ధాన్యం సేకరించినట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.
తెలంగాణ నుంచి 70.22 లక్షల టన్నుల ధాన్యం కొన్నం
- తెలంగాణం
- March 29, 2022
లేటెస్ట్
- Ben Wells: అరుదైన గుండె జబ్బు.. 23 ఏళ్లకే క్రికెట్కు గుడ్ బై
- CSK vs PBKS: చెన్నై జోరుకు బ్రేక్.. సొంతగడ్డపైనే మట్టికరిపించిన పంజాబ్
- బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ అరెస్ట్
- అది హాస్పిటలా..! లేక పబ్బా; బాధ్యత మరిచిన సిబ్బంది
- Champions Trophy 2025: పాకిస్తాన్లో పర్యటించనున్న భారత్.. ఐకానిక్ స్టేడియంలో మ్యాచ్లు!
- గ్రేట్: అవయవ దాత తల్లికి అంత్యక్రియలు చేసిన వ్యక్తి
- అలర్ట్: గ్రూప్ 1 ఎగ్జామ్పై TSPSC కీలక ప్రకటన
- CMSS లో పోస్టులు భర్తీ.. నెలకు రూ. లక్ష జీతం
- ప్రభుత్వ రంగ సంస్థలను తీసుకొస్త : గడ్డం వంశీకృష్ణ
- చంద్రుడిపై అనకున్నదానికంటే ఎక్కువ నీటి ఆనవాళ్లు
Most Read News
- ఇస్రోలో ఉద్యోగాలు, జీతం రూ.56వేలు..అప్లయ్ చేసుకోండిలా
- టీ20 వరల్డ్ కప్.. ఆఫ్ఘనిస్తాన్ టీమ్ ఇదే
- వాట్సాప్లో కొత్త రూల్స్: ఇలా చేస్తే ఆటోమేటిక్గా మీ అకౌంట్ బ్లాక్..!
- T20 World Cup 2024: క్వాంటిటీ కంటే క్వాలిటీ ముఖ్యం.. సెలెక్టర్లను ఏకిపారేసిన రాయుడు
- కొత్త కారు : మారుతీ స్విఫ్ట్ 2024 మోడల్ బుకింగ్స్ ఓపెన్
- కెప్టెన్గా మిచెల్ మార్ష్.. టీ20 వరల్డ్ కప్కు ఆస్ట్రేలియా టీమ్ ఇదే
- T20 World Cup 2024: అలుపెరగని శ్రామికుడు.. ప్రపంచ కప్ జట్టులో చోటుపై శాంసన్ ఎమోషనల్ పోస్ట్
- IPL 2024: టీమిండియాకు కలిసి రానున్న ముంబై, బెంగళూరు ఓటములు
- Varuthini ekadashi 2024: మే 4 వరూథిని ఏకాదశి.. ఆరోజు ఏం చేయాలంటే..
- SRH vs RR: 30వేల టికెట్స్ 5 నిమిషాల్లో సోల్డ్ ఔట్.. జోరుగా బ్లాక్ దందా.. ఫ్యాన్స్ ఫైర్