తెలంగాణ నుంచి 70.22 లక్షల టన్నుల ధాన్యం కొన్నం   

తెలంగాణ నుంచి 70.22 లక్షల టన్నుల ధాన్యం కొన్నం   

న్యూఢిల్లీ, వెలుగు: మొన్న వానాకాలం సీజన్ లో తెలంగాణ నుంచి 70 లక్షల 22 వేల టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇందుకోసం రూ. 13,763 కోట్ల ఎంఎస్పీని చెల్లించామని, రాష్ట్రంలో 10,62,428 మంది రైతులకు ప్రయోజనం చేకూరిందని పేర్కొంది. 2021–-22 వానాకాలం సీజన్ లో దేశవ్యాప్తంగా 741.62 ఎల్ఎంటీల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపింది. పంజాబ్, చత్తీస్ గఢ్​, తెలంగాణ, ఏపీ, గుజరాత్, మధ్య ప్రదేశ్ సహా 24 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి ఈ ధాన్యం కొనుగోలు చేసినట్లు వివరించింది. ఇందుకోసం రూ.1,15,358 కోట్ల మద్దతు ధరతో దేశవ్యాప్తంగా 105.14 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరిందని కేంద్రం తెలిపింది. ఈ మేరకు కేంద్ర ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం... ధాన్యం సేకరణలో పంజాబ్ ఫస్ట్ ప్లేస్​లో ఉండగా, చత్తీస్ గఢ్​ సెకండ్ ప్లేస్ లో ఉంది. తర్వాత మూడోస్థానంలో తెలంగాణ నిలిచింది. పంజాబ్ నుంచి 1,87,28,335 టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా, చత్తీస్ గఢ్​ నుంచి 92,01,000 టన్నుల ధాన్యం సేకరించినట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.