
ఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ వ్యాపించకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. చైనా నుంచి వచ్చిన భారతీయులకు వైద్య పరీక్షలు జరుగుతున్నాయన్నారు. ఇప్పటివరకు కేరళలోని ఇద్దరు వ్యక్తులకు కారోనా వైరస్ సోకినట్టు తెలుస్తుందని..వాళ్ళకి చికిత్స అందిస్తున్నామని అన్నారు.
కరోనా వైరస్ పై కేంద్ర ప్రభుత్వం టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేసిందని అన్నారు కిషన్ రెడ్డి. ఈ వైరస్ పై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ఆధ్వర్యంలో సమావేశం జరగనుందని తెలిపారు.ఈ కమిటీలో తనతో పాటుగా మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి, పౌర విమానయాన శాఖ మంత్రి, విదేశాంగ మంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి పాల్గోననున్నారని తెలిపారు.