IAS, IPS బదిలీలపై హైకోర్టులో కేంద్రం పిటిషన్

IAS, IPS బదిలీలపై హైకోర్టులో కేంద్రం పిటిషన్

తెలుగు రాష్ట్రాల్లో ఐఏఎస్, ఐపీఎస్ బదిలీలపై  తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది కేంద్రం. ఐఏఎస్, ఐపీఎస్ ల  బదిలీల విచారణను అత్యవసరంగా చేపట్టాలని కోరింది.   జూన్ 5 న విచారిస్తామని హైకోర్టు తెలిపింది. 

రాష్ట్ర విభజన తర్వాత 14 మంది  IAS , IPS అధికారులను AP, తెలంగాణకు కేటాయించింది కేంద్రం.  కేంద్ర ఉత్తర్వులపై క్యాట్ ను ఆశ్రయించి ఎక్కడికక్కడ విధులు నిర్వహిస్తున్నారు  అధికారులు. ఈ క్రమంలో  క్యాట్ ఉత్తర్వులపై హైకోర్టును ఆశ్రయించింది కేంద్రం.  ఇప్పటికే హైకోర్టు అదేశాలతో IAS అధికారి సోమేశ్ కుమార్  AP కి వెళ్లారు.  ఈ నేపథ్యంలో    తెలంగాణలో విధులు నిర్వహిస్తున్న డీజీపీ అంజనీ కుమార్ సహా 12 మంది అధికారుల బదిలీలపై ఉత్కంఠ కొనసాగుతోంది.