తెలుగు రాష్ట్రాల్లో ఐఏఎస్, ఐపీఎస్ బదిలీలపై తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది కేంద్రం. ఐఏఎస్, ఐపీఎస్ ల బదిలీల విచారణను అత్యవసరంగా చేపట్టాలని కోరింది. జూన్ 5 న విచారిస్తామని హైకోర్టు తెలిపింది.
రాష్ట్ర విభజన తర్వాత 14 మంది IAS , IPS అధికారులను AP, తెలంగాణకు కేటాయించింది కేంద్రం. కేంద్ర ఉత్తర్వులపై క్యాట్ ను ఆశ్రయించి ఎక్కడికక్కడ విధులు నిర్వహిస్తున్నారు అధికారులు. ఈ క్రమంలో క్యాట్ ఉత్తర్వులపై హైకోర్టును ఆశ్రయించింది కేంద్రం. ఇప్పటికే హైకోర్టు అదేశాలతో IAS అధికారి సోమేశ్ కుమార్ AP కి వెళ్లారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో విధులు నిర్వహిస్తున్న డీజీపీ అంజనీ కుమార్ సహా 12 మంది అధికారుల బదిలీలపై ఉత్కంఠ కొనసాగుతోంది.