ఉద్యోగాలు కల్పించడంలో కేంద్రం విఫలం

ఉద్యోగాలు కల్పించడంలో కేంద్రం విఫలం

నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం. రానున్న ఎన్నికల్లో నిరుద్యోగ సమస్యే కీలక అంశమన్నారు. ఉద్యోగాల సృష్టిలో విఫలమైన బీజేపీ ప్రభుత్వం..ఈ అంశంలో ప్రజలను మభ్యపెడుతోందని ఆరోపించారు. ప్రభుత్వ ప్రచారాల్లోని అవాస్తవాలను భారత పరిశ్రమల శాఖ బయటపెట్టిందన్నారు. దీనిపై మిగిలిన వారు కూడా గళం వినిపించాల్సి అవసరం ఉందన్నారు. ఈ విషయాన్ని శనివారం ట్విట్టర్‌ వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ప్రైవేటు రంగం నుంచి కొత్త పెట్టుబడులు రావడం లేదని తెలిపారు.  ప్రస్తుతం 6-16 ఏళ్ల మధ్య ఉన్న వారికి పదేళ్ల తర్వాత ఉద్యోగం కల్పించడం కష్టమని  అభిప్రాయపడ్డారు చిదంబరం.