
అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంతో దేశం ఉలిక్కి పడిన సంగతి తెలిసిందే.. ఇండియా చరిత్రలోనే ఇంతటి విమాన ప్రమాదం ఇప్పటి వరకు జరగలేదు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య గంట గంటకు పెరుగుతూనే ఉంది. శనివారం (జూన్ 14) ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక లెక్కల ప్రకారం మృతుల సంఖ్య 275కు చేరుకుంది. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న కేంద్రం విచారణను స్పీడప్ చేసింది. ఈ క్రమంలో 11 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది కేంద్రం. ప్రభుత్వానికి సంబందించిన కీలక శాఖలలోని అధికారులు ఈ కమిటీలో సభ్యులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కంద్రం.
ఈ ఘటనలో మరణించినవారికి గుర్తించేందుకు డీఎన్ఏ పరిక్ష నిర్వహించాలని నిర్ణయించారు అధికారులు. ఇందుకోసం ఇప్పటికే శాంపిల్స్ సేకరించగా 7 మృతదేహాలను గుర్తించారు ఫోరెన్సిక్ సిబ్బంది. ఈ కేసు విచారణలో బ్లాక్ బాక్స్ కీలకం కానుంది. బ్లాక్ బాక్స్ లోని DFDR, CVR డేటా ఆధారంగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అధికారులు.
A High Level Multi-disciplinary Committee is constituted for examining the causes leading to the crash of the Air India Flight AI-171 from Ahmedabad to Gatwick Airport (London) on June 12, 2025.
— MoCA_GoI (@MoCA_GoI) June 13, 2025
The Committee will examine the existing Standard Operating Procedures (SOPs) and… pic.twitter.com/84h96oHT5f
11 మంది సభ్యులు వీరే:
- కేంద్ర హోం కార్యదర్శి, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
- కార్యదర్శి, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం
- అదనపు కార్యదర్శి/ జాయింట్ సెక్రటరీ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం
- రాష్ట్ర హోం శాఖ, గుజరాత్ ప్రభుత్వం
- స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ అథారిటీ, గుజరాత్ ప్రభుత్వం
- పోలీస్ కమీషనర్, అహ్మదాబాద్
- డైరెక్టర్ జనరల్, ఇన్స్పెక్షన్ అండ్ సేఫ్టీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్
- డైరెక్టర్ జనరల్, బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ/ DG BCAS
- డైరెక్టర్ జనరల్, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్/DG DGCA
- స్పెషల్ డైరెక్టర్, ఇంటెలిజెన్స్ బ్యూరో
- డైరెక్టర్, డైరెక్టరేట్ ఆఫ్ ఫోరెన్సిక్ సైన్స్ సర్వీసెస్, భారత ప్రభుత్వం.
అహ్మదాబాద్ నుంచి లండన్ కు బయల్దేరిన AI 171 విమానం లేక్ ఆఫ్ అయిన కాసేపటికే నేల కూలడంతో ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. గాయాలతో బయటపడిన వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే విమాన ప్రమాదాన్ని కేంద్రం సీరియస్ గా తీసుకుంది. ఘటనకు సంబంధించిన కారణాలను అన్వేషిస్తోంది. బ్లాక్ బాక్స్ లభ్యం అవ్వడంతో ప్రమాదానికి సంబంధించిన కారణాలపై పూర్తిస్థాయిలో విచారణ జరపనున్నారు.
ఈ ఘటనపై విచారణ జరిపేందుకు కేంద్ర హోంశాఖ సెక్రటరీ ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. గురువారం (జూన్ 12) న జరిగిన ప్రమాదానికి గల కారణాలను ఈ కమిటీ విచారించనుంది. అదే విధంగా భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా విధివిధానాలను రూపొందించి ప్రభుత్వానికి, పౌర విమాన శాఖకు సిఫారసు చేయనుంది.