
జమిలి ఎన్నికల అంశం లా కమిషన్ పరిధిలో ఉందని కేంద్రం తెలిపింది. ఈ అంశంపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ, కేంద్ర ఎన్నికల సంఘం సహా అనేక భాగస్వామ్య పక్షాలతో చర్చించినట్లు న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. లోక్భలో ఎంపీ భగీరథ చౌదరీ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. స్టాండింగ్ కమిటీ తమ నివేదికలో కొన్ని ప్రతిపాదనలు, సిఫార్సులు చేసిందని..ఆ నివేదిక ఆధారంగా లా కమిషన్ సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేస్తూ రోడ్ మ్యాప్ తయారుచేసే పనిలో నిమగ్నమైనట్లు చెప్పారు.
8 ఏళ్లలో.. ఎన్నికల నిర్వహణ ఖర్చు 7వేల కోట్లు
తరచుగా వచ్చే ఎన్నికలు నిత్యావసర సేవలు సహా ప్రజా జీవితాన్ని ప్రభావితం చేస్తున్నాయని స్టాండింగ్ కమిటీ నివేదికలో పేర్కొందని కిరణ్ రిజిజు తెలిపారు. పార్లమెంట్, రాష్ట్ర అసెంబ్లీలకు వేరువేరుగా జరిగే ఎన్నికల కారణంగా భారీగా ప్రజాధనం ఖర్చవుతుందన్నారు. 2014 నుంచి 2022 మధ్యకాలంలో ఎన్నికల నిర్వహణకు రూ.7వేల కోట్లకు పైగా ఖర్చు పెట్టాల్సి వచ్చిందని చెప్పారు.