తెలంగాణలో కొత్తగా 2 గోదాములు

తెలంగాణలో కొత్తగా 2  గోదాములు

హైదరాబాద్​, వెలుగు : రాష్ట్రంలో కొత్తగా రెండు గోదాములను నిర్మించాలని సెంట్రల్ వేర్​హౌసింగ్​ కార్పొరేషన్ నిర్ణయించింది. హైదరాబాద్​లో జరిగిన పెట్టుబడిదారుల సదస్సు సందర్భంగా ఈ నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న తన గోదాములను  డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్ అండ్ ట్రాన్స్‌‌‌‌ఫర్ మోడల్‌‌‌‌లో 45 సంవత్సరాలపాటు లీజుకు ఇస్తుంది.

తెలంగాణలో నాంపల్లి, వరంగల్​లో గోదాములు ఏర్పాటు చేస్తారు. ఇందుకు  అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ నైట్ ఫ్రాంక్ ఇండియాను నాలెడ్జ్​ పార్ట్​నర్​గా సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ నియమించుకుంది. ల్యాండ్ పార్సిళ్లను భారతదేశం అంతటా మార్కెటింగ్ చేయడానికి నైట్​ఫ్రాంక్​ సేవలు అందిస్తుంది.