
మెహిదీపట్నం, వెలుగు: బంగారు గొలుసు చోరీ కేసులో పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ చంద్రమోహన్ టోలిచౌకి పోలీస్ స్టేషన్లో వివరాలు వెల్లడించారు. ఈ నెల 14న మధ్యాహ్నం ఆర్టీసీ బస్సులో గనిపినేని బాబు మెడలోని 1.4 తులాల బంగారు గొలుసు చోరీ అయింది. మల్లేపల్లికి చెందిన బండారి కేశవ్, కాంబ్లే శ్యాంసుందర్, సూరజ్, వంశీ, వంశీవర్ధన్ ను నిందితులుగా గుర్తించారు. సోమవారం టోలిచౌకిలో కేశవ్, శ్యాంసుందర్, సూరజ్ ను అరెస్ట్చేశారు. వంశీ, వంశీవర్ధన్ పరారీలో ఉన్నారు.
దారి దోపిడీ కేసులో నలుగురు..
టోలిచౌకి ప్రాంతానికి చెందిన గోపి అనే వ్యక్తిని టాస్క్ ఫోర్స్ పోలీసులమని బెదిరించి డబ్బులు, సెల్ఫోన్ లాక్కున్న నలుగురిని పట్టుకున్నట్లు డీసీపీ చంద్రమోహన్ తెలిపారు. టోలిచౌకి, హకీంపేట్ కు చెందిన అబ్దుల్ సల్మాన్, షేక్ ఆదిల్, మహమ్మద్ నవాజ్, మహమ్మద్ అబ్దుల్ ఫరీజ్, ఫజిల్ ను నిందితులుగా గుర్తించారు. ఫజిల్ పరారీలో ఉన్నాడు.
వ్యాపారీ ఇంట్లో చోరీ నిందితులు..
హైదర్ గూడలోని అవంతి నగర్ లో వ్యాపారీ రామకృష్ణ ఇంట్లో రూ.17.50 లక్షలు,173 తులాల బంగారు ఆభరణాలు చోరీ చేసిన కేసులో నలుగురిని అరెస్టు చేసినట్లు డీసీపీ బాలస్వామి తెలిపారు. అంబర్పేటలోని ఈస్ట్జోన్ డీసీపీ ఆఫీసులో వివరాలు తెలిపారు. చౌపాల్ సాగర్, ఆకాశ్కుమార్, సక్లేన్ ఖాన్, చంద్రశేఖర్ ను పట్టుకోగా ముగ్గురు పరారీలో ఉన్నారు.