చందానగర్​లో చైన్ స్నాచింగ్

చందానగర్​లో చైన్ స్నాచింగ్
  • వృద్ధురాలి మెడలోని 5 తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లిన దొంగలు

గచ్చిబౌలి, వెలుగు: వృద్ధురాలి మెడలోని బంగారాన్ని చైన్ స్నాచర్లు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన చందానగర్ పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  హుడా ట్రేడ్ సెంటర్ లోని సాయి భరత్ ఆర్కిడ్ అపార్ట్​మెంట్​లో ఉంటున్న కోట సుబ్బరత్నమ్మ(50) గురువారం మధ్యాహ్నం దగ్గరలోని స్కూల్​లో చదువుతున్న మనవరాలిని తీసుకురావడానికి వెళ్లింది.

 1.15 గంటలకు మనవరాలితో కలిసి ఇంటికి వెళ్తుండగా.. మారుతి హాస్పిటల్ వద్ద బైక్​పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు వృద్ధురాలి మెడలోని 5 తులాల పుస్తెల తాడును లాక్కుని పరారయ్యారు. సుబ్బరత్నమ్మ చందానగర్ పోలీసులకు కంప్లయింట్ చేసింది. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.