నాగోల్ లో చైన్ స్నాచింగ్

నాగోల్ లో చైన్ స్నాచింగ్

ఎల్​బీనగర్, వెలుగు: వృద్ధురాలి మెడలోని చైన్ ను స్నాచర్ కొట్టేసిన ఘటన నాగోల్ పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగోల్ జయపురి కాలనీకి చెందిన జమండ్ల పద్మ (60) కొడుకు దగ్గరలోని శ్రీనివాస కాలనీలో కొత్త ఇల్లు కడుతున్నాడు.

సోమవారం పద్మ తన కోడళ్లతో కలిసి ఆ ఇంటి నిర్మాణ పనులు చూసేందుకు వెళ్లింది. కోడళ్లిద్దరూ ఇంటి లోపలికి వెళ్లగా.. పద్మ బయట ఆగి ఉన్న ఓ ఆటోలో కూర్చుని ఉంది. అదే టైమ్ లో స్కూటీపై వచ్చిన ఓ వ్యక్తి ఆమె మెడలోని 6 తులాల బంగారు నగను లాక్కుని పారిపోయాడు. పద్మ ఇచ్చిన కంప్లయింట్ తో  కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.