ఢిల్లీ లో జరిగింది కేబి నెట్ మీటింగ్ కాదు.. కాంగ్రెస్ మీటింగ్ : ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

ఢిల్లీ లో జరిగింది కేబి నెట్ మీటింగ్ కాదు.. కాంగ్రెస్ మీటింగ్ : ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
  • బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ విమర్శలకు చామల కౌంటర్

హైదరాబాద్, వెలుగు: ఢిల్లీలో గురువారం జరిగింది రాష్ట్ర కేబినెట్ మీటింగ్ కాదని.. అది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మీటింగ్ అని ఎంపీ చామల కిరణ్​ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర కేబినెట్ మీటింగ్ ఢిల్లీలో జరిగిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు మతి తప్పి మాట్లాడుతున్నారని గురువారం ప్రకటనలో ఫైర్ అయ్యారు. 

రాష్ట్ర కేబినెట్ మీటింగ్ ఈ నెల 23 న ఉందని, ఈ విషయం హరీశ్ రావు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని తెలిపారు. ఇటు పంచాయతీ.. అటు మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘోర పరాజయం పాలవడంతో హరీశ్ రావు మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.