కొత్త ఓటరుగా నమోదుకు ఈనెల 15 వరకు చాన్స్

కొత్త ఓటరుగా నమోదుకు ఈనెల 15 వరకు చాన్స్

కొడంగల్​, వెలుగు :  కొత్త ఓటరుగా నమోదుకు ఈనెల 15 వరకే చాన్స్ ఉందని వికారాబాద్ అడిషనల్​ కలెక్టర్​ లింగ్యా నాయక్​ తెలిపారు. సోమవారం కొడంగల్​తహసీల్దార్​ ఆఫీసులో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమై మాట్లాడారు. ఫారం 6 ద్వారా కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి పార్లమెంట్​ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం ఉంటుందన్నారు.

కొడంగల్​ సెగ్మెంట్​లో కొత్తగా 7 సహాయక( యాగ్జిలరీ ) పోలింగ్​ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఈవీఎంల స్ర్టాంగ్​ రూమ్​ను ప్రభుత్వ జూనియర్​ కాలేజీలో ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎన్నికల కోడ్​ను అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ర్యాలీలు, మీటింగ్​లు, మైక్ లు , వాహనాల​ పర్మిషన్​లకు సువిధా యాప్​లో 48 గంటల ముందు ఆన్​లైన్​ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎన్నికను ప్రశాంతంగా నిర్వహించేందుకు సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో తహసీల్దార్లు విజయ్​కుమార్, మహేష్​ గౌడ్, వివిధ పార్టీల​నేతలు బషీర్​, రమేష్​ బాబు, గుల్షన్​, ముస్తాక్​, కృష్ణ పాల్గొన్నారు. 

దళారులను నమ్మి మోసపోవద్దు

రైతులు దళారులను ఆశ్రయించకుండా ధాన్యం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే అమ్మాలని కలెక్టర్​ లింగ్యా నాయక్​ సూచించారు. బొంరాస్ పేట మండలం నాగిరెడ్డిపల్లిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. జిల్లాలో 122 కేంద్రాల ద్వారా ధాన్యాన్ని సేకరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు.

ఈనెల 4 వరకు అన్ని మండలాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. రబీ సిజన్​లో లక్ష 93 వేల మేట్రిక్​టన్నుల ధాన్యాన్ని సేకరించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. గ్రేడ్​–-1కు రూ.2203, గ్రేడ్​-–2కు రూ.2,183గా ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పౌరసరఫరాల జిల్లా మేనేజర్​సుగుణ బాయి, రాజేశ్వర్​ తదితరులు పాల్గొన్నారు.