తుర్కయాంజల్​ చందన షోరూమ్​

తుర్కయాంజల్​ చందన షోరూమ్​

ఫ్యాషన్​ రిటైలర్ ప్యాట్నీ సెంటర్​ చందనా బ్రదర్స్  హైదరాబాద్ ​ సమీపంలోని తుర్కయాంజల్​లో షాపింగ్​మాల్​ను ఓపెన్​ చేసింది. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్​ రెడ్డి, సినీనటి అనూ ఇమాన్యుయేల్​ దీనిని ప్రారంభించారు.

నాలుగు అంతస్తుల్లో, 15 వేల చదరపు అడుగుల్లో విస్తరించి ఉంది. అన్ని రకాల వేడుకలకు అవసరమైన దుస్తులు ఇక్కడ హోల్​సేల్​  ధరలకు లభిస్తాయని సంస్థ తెలిపింది. ఈ మాల్​ వల్ల 200 మందికి ఉపాధి దొరుకుతుందని సంస్థ యజమాని అల్లక  సత్యనారాయణ చెప్పారు.