ఫ్యాషన్ రిటైలర్ ప్యాట్నీ సెంటర్ చందనా బ్రదర్స్ హైదరాబాద్ సమీపంలోని తుర్కయాంజల్లో షాపింగ్మాల్ను ఓపెన్ చేసింది. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, సినీనటి అనూ ఇమాన్యుయేల్ దీనిని ప్రారంభించారు.
నాలుగు అంతస్తుల్లో, 15 వేల చదరపు అడుగుల్లో విస్తరించి ఉంది. అన్ని రకాల వేడుకలకు అవసరమైన దుస్తులు ఇక్కడ హోల్సేల్ ధరలకు లభిస్తాయని సంస్థ తెలిపింది. ఈ మాల్ వల్ల 200 మందికి ఉపాధి దొరుకుతుందని సంస్థ యజమాని అల్లక సత్యనారాయణ చెప్పారు.