బీజేపీ చేసిన కుట్రను ఖండిస్తున్నా: చంద్రబాబు

బీజేపీ చేసిన కుట్రను ఖండిస్తున్నా: చంద్రబాబు

నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరడంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు రాష్ట్ర అంశాలపైనే తాము బీజేపీతో పోరాటం చేశామన్నారు. ప్రత్యేక హోదా కోసం కేంద్ర మంత్రి పదవులను సైతం వదులుకున్నామన్నారు. తెలుగుదేశం పార్టీని బలహీనం చేయడానికి బీజేపీ చేస్తున్న కుట్రలను ఖండిస్తున్నట్టు చెప్పారు బాబు. పార్టీలో సంక్షోభం కొత్తేం కాదన్న బాబు.. పార్టీ నేతలు.. కేడర్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. యూరప్ ట్రిప్ లో ఉన్న ఆయన.. పార్టీ ముఖ్యనేతలతో ఫోన్ లో మాట్లాడారు.