ఓటు హక్కును వినియోగించుకున్న చంద్రబాబు, జగన్

ఓటు హక్కును వినియోగించుకున్న చంద్రబాబు, జగన్

ఆంధ్రప్రదేశ్‌ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఉండవల్లిలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కుటుంబంతో కలిసి వచ్చిన ఆయన ఓటు వేశారు. అనంతనం మీడియా చంద్రబాబు మాట్లాడారు. ఓటర్లందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు. అన్యాయం పై న్యాయం గెలవాటానికి ఓటు ఒక సాధనం అని తెలిపారు.

సమాజంలో మార్పుకోసం ఓటేయండి: జగన్
ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ చీఫ్ జగన్  ఓటు వేశారు. వారి భార్యతో కలిసి వచ్చిన జగన్ కడప జిల్లా పులివెందులలో పోలింగ్ లో పాల్గొన్నారు. మీడియాతో మాట్లాడిన ఆయన.. సమాజంలో మార్పుకోసం నిర్భయంగా ఓటువేయాలని ప్రజలను కోరారు. ఏపీ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని.. దేవుని దయ వలన మార్పురావాలని ఆశిస్తున్నట్లు తెలిపారు.

అమరావతి మలుపు తిప్పే రోజు: లోకేశ్
ఈ రోజు అమరావతిని మలుపు తిప్పే రోజు అని ఏపీ మంత్రి నారాలోకేశ్ అన్నారు. ప్రతీ ఒక్కరూ ఓటింగ్ లో పాల్గొనాలని కోరారు.