ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు సంచలన ప్రకటన

ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు సంచలన ప్రకటన

ఏపీలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాలకు హాజరైన మాజీ సీఎం చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. తీవ్ర ఉద్వేగానికి లోనయిన ఆయన.. మళ్లీ సీఎంగానే సభలోకి అడుగుపెడతానంటూ సభ నుంచి వెళ్లిపోయారు. 

‘అసెంబ్లీలో పడరాని అవమానాలు ఎదుర్కొన్నాను. వ్యక్తిగతంగా తిట్టారు, పార్టీ పరంగా తిట్టారు. చివరికి నా కుటుంబసభ్యుల్ని కూడా రోడ్డు మీదకు లాగారు. సభలో ఎన్నో చర్చలు చూశాం కానీ, ఇంత అవమానం ఎప్పుడూ ఎదుర్కోలేదు. కుప్పంలో టీడీపీ ఓడిపోయిన తర్వాత కూడా సీఎం జగన్ నా మొహం చూడాలన్నారు. ఏ పరువు కోసమైతే నేను ఇన్నేళ్లు తాపత్రయపడ్డానో దాన్ని దెబ్బతీస్తున్నారు. గత రెండున్నరేళ్లుగా తీవ్ర అవమానాలు ఎదుర్కొన్నాను. మళ్లీ సీఎం అయిన తర్వాతే అసెంబ్లీకి వస్తాను.’ అని చంద్రబాబు వాపోయారు.అసెంబ్లీలోని సభ్యులందరికీ నమస్కరిస్తూ.. కన్నీళ్లతో టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలతో సహా ఆయన అసెంబ్లీ నుంచి బయటకు వెళ్లిపోయారు. 

https://www.youtube.com/watch?v=eB8X7bYXjco