
ప్రధాని మోదీకి ఓ రిక్వెస్ట్ చేశారు ఏపీ సీఎం చంద్రబాబు..500రూపాయలు అంతకంటే ఎక్కువ విలువ చేసే కరెన్సీ నోట్లను రద్దు చేయాలని కోరారు. ఇప్పుడు దీనిపైనే చర్చ.. అసలు సీఎం చంద్రబాబు 500 రూపాయల నోట్లు ఎందుకు రద్దు చేయమన్నారు..అందుకు ప్రధాని ఏం సమాధానం చెప్పారు.. చంద్రబాబు డిమాండ్ వెనక కారణాలేంటీ..
ప్రధాని మోదీకి డిజిటల్ కరెన్సీ రిపోర్టు ఇచ్చిన సమయంలో చంద్రబాబు ఈ విషయాన్ని అడిగారట. అది స్వయంగా చంద్రబాబు చెప్పుకొచ్చారు. రూ. 500, రూ. 2000 నోట్ల ముద్రణ ఆపమని, డిజిటల్ కరెన్సీని ప్రోత్సహించాలని కోరినట్లు తెలిపారు. ఇదే విషయాన్ని వైఎస్సార్ కడపలో జరిగిన టీడీపీ మహానాడులో పార్టీ కార్యకర్తలనుద్దేశించి చెప్పారు. ప్రపంచం ఇప్పుడు డిజిటల్ కరెన్సీ వైపు వేగంగా కదులుతోంది. తాను చేసిన సిఫారసుపై చర్య తీసుకోవాలని ప్రధానిని కోరినట్లు చంద్రబాబు చెప్పారు.
మరోసారి కడప వేదికగా ప్రధానిని అభ్యర్థిస్తున్నాను. ఇది డిజిల్ కరెన్సీ ప్రపంచం.. పార్టీ కార్యకలాపాలకు విరాళం ఇవ్వవలసి వస్తే.. QR కోడ్ ద్వారా విరాళాలు పొందవచ్చు.. రూ. 500, రూ. 2000 నోట్ల పంపిణీ అవసరం లేదని చంద్రబాబు అన్నారు.
2017జనవరిలో చంద్రబాబు నేతృత్వంలోని ప్యానెల్ డిజిటల్ కరెన్సీపై రిపోర్టును కేంద్రానికి సమర్పించింది. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడానికి మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) ఛార్జీలను రద్దు చేయడాన్ని ఆమోదించడం..పెద్ద లావాదేవీలపై ఆంక్షలు విధించడం, రూ. 50,000 మరియు అంతకంటే ఎక్కువ బ్యాంకింగ్ నగదు లావాదేవీల పన్ను వంటి డిమాండ్లను చంద్రబాబు తన రిపోర్టులో తెలిపారు.
చంద్రబాబు డిమాండ్ వెనక కారణాలు ఏంటనీ పరిశీలిస్తే.. పెద్దనోట్ల వల్ల అవినీతి పెరిగిపోతుంది.. ముఖ్యంగా రాజకీయాల్లో మరీ అవినీతి విపరీతంగా పెరిగింది.. ఎన్నికల సమయంలో పెద్ద నోట్లను పంచుతున్నారని ,అవినీతి రాజకీయాలను అంతమొందించాలంటే పెద్ద నోట్లు అయిన రూ. 500, రూ.2000 నోట్లను రద్దు చేయాలని ప్రధానికిసూచించినట్లు తెలుస్తోంది. మరోవైపు డిజిటల్ చెల్లింపులకు వేగంగా మారడంతో పాటు అధిక కరెన్సీ నోట్లను రద్దు చేయాలని చంద్రబాబు కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు.