కేసీఆర్ కు 10 రిటర్న్ గిఫ్ట్ లిస్తా

కేసీఆర్ కు 10 రిటర్న్ గిఫ్ట్ లిస్తా

కేసీఆర్ ఒక గిఫ్ట్ ఇస్తే.. తాను 10 రిటర్న్ గిఫ్ట్‌‌లు ఇస్తానని, కేసీఆర్ ఇంటికి తన ఇల్లు ఎంత దూరమో.. తన ఇంటికి కేసీఆర్ ఇల్లు కూడా అంతే దూరమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. మంగళవారం కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల్లో ఎన్నికల ప్రచార సభల్లో ఆయన మాట్లా డారు. “కేసీఆర్ పంపే డబ్బులకు ఏపీలో ఓట్లు రాలవు. ఏం చేశాడని జగన్‌‌కు 22 ఎంపీ సీట్లు వస్తాయి ? జగన్‌‌ను కేసీఆర్ పావుగా వాడుకుంటున్నారు. తెలంగాణలో ఏమాత్రం అభివృద్ధి చేయని కేసీఆర్ 16 ఎంపీ సీట్లు గెలిస్తే… ఏపీకి ఎంతో చేసిన టీడీపీ ఎన్ని సీట్లు గెలవాలి? కేసీఆర్ ఏ అధికారంతో పోలవరంపై కోర్టుల్లో కేసులేస్తున్నారు? ఏపీ  అభివృద్ధి దడం జగన్, మోడీ, కేసీఆర్‌‌ లకు ఇష్టంలేదు. సగం అభివృద్ధి ఆగిపోవడానికి వాళ్లే కారణం. కుట్రలకు పాల్పడుతున్న  ఎస్సార్ సీపీకి డిపాజిట్లు రాకుండా చేయాలి” అని ప్రజలకు పిలుపునిచ్చారు. ఏపీలో టీడీపీ మళ్లీ గెలవడం చారిత్రక అవసరమన్నారు. అభ్యర్థుల ఎంపికలో ఎక్కడా రాజీ పడలేదని చెప్పారు. 60 లక్షల పసుపు సైన్యం ఉన్న టీడీపీని ఓడించే శక్తి ఎవరికీ లేదని ధీమా వ్యక్తం చేశారు.

ఉమ్మడి ఏపీలో అభివృద్ధి చేసిన ఆస్తుల్లో భాగంగా తెలంగాణ నుం చి ఏపీకి లక్షల కోట్లు రావాల్సి ఉం దన్నారు. ఏపీ ఎన్ని కలతో తమకు సంబంధం లేదని కేటీఆర్‌‌ అంటున్నారని, మరి ఏపీకి డబ్బులు పంపడం అవసరమా అని ప్రశ్నిం చారు. కోడి కత్తి పార్టీవి అన్నీ డ్రామాలే.. వైఎస్ వివేకాను హత్య చేసి, ఇతరులపై నేరం మోపాలని ప్రయత్ని స్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. “వ్యక్తి చనిపోతే పోలీసులకు సమాచారం ఇవ్వకుండా గుండె పోటు, రక్తం కక్కుకుని చనిపోయాడని ప్రచారం చేశారు. హత్య జరిగాక మృతదేహానికి ఎవరైనా కుట్లు వేస్తారా? బాత్ రూం లో రక్తపుమరకలను ఎందుకు కడిగేశారో, బెడ్ షీట్లను ఎందుకు మార్చారో ఇప్పటికీ చెప్పడం లేదు. లోటస్ పాండ్ లోని జగన్ కు తెలియకుండా వేకానందరెడ్డి హత్య జరిగి ఉంటుందా? వాళ్లే చంపి లేఖ రాసినట్లు సృష్టిం చారు. ఇలాంటి వ్యక్తి అధికారంలోకి వస్తే  సామాన్యులకు  రక్షణ ఉంటుందా? అనంతపురం జిల్లా లో పరిటాల రవితోపాటు 110 మంది కార్యకర్తలను పొట్టన పెట్టుకున్నారు. జగన్ కరుడుగట్టిన నేరస్తుడు. ప్రధాని మోడీ నేరస్తు లను ప్రోత్సహిస్తున్నారు” అని బాబు ఆరోపించారు. నాకు కోటి మంది అక్కా చెల్లెళ్లు డ్వాక్రా మహిళలకు పసుపు కుం కుమ ఇచ్చిన ఘనత  తనదేనని, తనకు కోటి మంది అక్కా చెల్లెళ్లు ఉన్నారని చంద్రబాబు అన్నారు.

“కడప జిల్లాలో పార్టీని గెలిపించకపోయినా చీనీ రైతులను ఆదుకున్నాం . కుప్పం కన్నా ముం దే పులివెందులకు నీళ్లిచ్చాం . భవిష్యత్తులో కడపలో హార్టికల్చర్ హబ్, ఫుడ్ ప్రాసెసింగ్  యూనిట్లు ఏర్పాటు చేస్తాం . రూ.20 వేల కోట్లతో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తాం ” అని అన్నారు. ఏపీలో పండే పంటలను ప్రపంచమంతా తినే పరిస్థితి వస్తుందని, చార్జీలు పెంచకుండా కోతలు లేకుండా కరెంటు అందిస్తున్నట్లు చెప్పారు. భద్రాచలం కన్నా మిన్నగా ఒంటిమిట్ట కోదండ రామాలయాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. పెద్ద దర్గా, గండికోటను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామన్నారు.