ఆ విషయంలో జగన్ జగ మొండి

ఆ విషయంలో జగన్ జగ మొండి

రాజధానిని అమరావతి నుంచి కదలనివ్వబోమన్నారు మాజీ సీఎం చంద్రబాబు.  మంగళగిరిలో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో మాట్లాడిన చంద్రబాబు..రాజధానిగా అమరావతే ఉండాలని ప్రజలు కోరుతున్నారన్నారు. ఎవరేం చేస్తారో చూస్తామన్నారు. సీఎం జగన్ అమరావతిపై మొండిగా ముందుకెళ్తున్నారన్నారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవడంలో జగన్ జగ మొండి అని అన్నారు. ఎన్టీఆర్‌ ఓ మహోన్నత వ్యక్తి అని టీడీపీ పనితీరుకు ఆయనే స్ఫూర్తి నిదర్శనమన్నారు. ఎన్టీఆర్‌ ఎక్కడున్నా ఆనందపడేలా అమరావతికి రూపకల్పన చేసామన్నారు.

రాష్ట్రానికి అమరావతి కామధేనువు లాంటిదన్నారు చంద్రబాబు. సెల్ఫ్‌ ఫైనాన్సింగ్‌ ప్రాజెక్ట్ లా అభివృద్ధి చెందుతుందన్నారు. 10 ఏళ్ల తరువాత రాష్ట్రానికి కావాల్సిన ఆదాయం ఇస్తుందన్నారు. కానీ సీఎం జగన్ 3 రాజధానులు నిర్ణయంతో ప్రజానీకం నిస్పృహలో పడిపోయిందన్నారు. అమరావతిని కాపాడుకోవడం కోసం 13 జిల్లాల్లో  పోరాటాలు చేయాలన్నారు.