లక్ష్యాన్ని ఎంచుకుంటే సాధించేవరకు రాజీపడేవారు కాదు

లక్ష్యాన్ని ఎంచుకుంటే సాధించేవరకు రాజీపడేవారు కాదు

ఒక యుగ పురుషుడు జన్మించిన రోజన్నారు ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ లో నివాళులర్పించిన ఆయన..ఎన్టీఆర్ తెలుగువారి ఆస్తి, వారసుడన్నారు. ఆయన ఒక వ్యక్తి కాదని శక్తి అన్నారు. ఆయన సాధించిన విజయాలు భవిష్యత్ లో ఎవరు సాధించలేరన్నారు. ఒక లక్ష్యాన్ని ఎంచుకుంటే సాధించే వరకు రాజీపడకుండా ముందుకెళ్లేవారన్నారు.  రాష్ట్ర, దేశ రాజకీయాల్లో చిరస్మరనియమన్నారు. రాజకీయాల్లో అనతి కాలంలోనే ప్రజలకు ఎం కావాలో చేసిన వ్యక్తి ఎన్టీఆర్ అని అన్నారు.రాజకీయాలకు అతీతంగా ఎన్టీఆర్ చరిత్రని గుర్తు చేసుకోవాలన్నారు.ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన గొప్ప నాయకుడన్నారు.