చిత్తూరు జిల్లా తిరుపతి రేణిగుంట ఎయిర్ పోర్టులో చంద్రబాబు నిరసన దీక్ష కంటిన్యూ అవుతోంది. చంద్రబాబును తరలించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ట్రూజెట్, ఇండిగో, స్పైస్ జెట్ విమానాల్లో చంద్రబాబుకు టికెట్లు బుక్ చేశారు. అయితే స్పైస్ జెట్ విమానం వెళ్లిపోగా.. రన్ వేపై ఇండిగో విమానం సిద్ధంగా ఉంది. అయితే చంద్రబాబు మాత్రం తన నిరసన దీక్షను కొనసాగిస్తున్నారు. నాలుగు గంటలుగా ఆయన నేలపై కూర్చుని, మంచి నీళ్లు కూడా తాగకుండా తన నిరసన తెలుపుతున్నారు.
మరోవైపు చంద్రబాబు నాయుడిది కేవలం రాజకీయ డ్రామా మాత్రమేనని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి విమర్శించారు. ప్రజలను మభ్యపెట్టేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. ఆలోచనలతో చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని, చంద్రబాబును రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితి లేదని వైసీపీ నేతలు స్పష్టం చేశారు.