కొత్తకోట దయాకర్ రెడ్డి మృతి పట్ల ప్రముఖుల సంతాపం

కొత్తకోట దయాకర్ రెడ్డి మృతి పట్ల  ప్రముఖుల సంతాపం

మాజీ ఎమ్మెల్యే కొత్త దయాకర్ రెడ్డి మృతిపట్ల  టీడీపీ అధినేత చంద్రబాబు సంతాపం తెలిపారు.  దయాకర్ రెడ్డి కుటుంబ సభ్యులకు  తన సానుభూతి తెలియజేశారు. కొత్త కోట టీడీపీ నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారని గుర్తు చేశారు చంద్రబాబు. నిత్యం ప్రజల్లో ఉంటూ సమర్థుడైన నాయకుడుగా దయాకర్ రెడ్డి పేరు తెచ్చుకున్నారని చంద్రబాబు అభిప్రాయ పడ్డారు.

మంచి మిత్రుడిని కోల్పోయామని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. కొత్తకోట దయాకర్ రెడ్డి మృతిపట్ల సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలిపారు. నిత్యం ప్రజల మధ్యే ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేసేవారన్నారు. 

 టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్, టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కొత్తకోట మృతిపట్ల సంతాపం తెలిపారు. మంచి సోదరుడిని కోల్పోయామని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలిపారు.

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గచ్చిబౌలిలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తుదిశ్వాస విడిచారు.