టీడీపీ అధినేత చంద్రబాబు కేసు తీర్పు కాసేపట్లో వెలువడనుంది. చంద్రబాబుకు బెయిల్ వస్తుందా?లేక రిమాండ్ కు తరలిస్తారా అనేదానిపై ఉత్కంఠ నెలకొంది. కోర్టు ప్రాంగణం నుండి సుమారు 3 కిలో మీటర్ల మేర తమ అధీనంలోకి తీసుకున్నారు పోలీసులు. మరో వైపు టీడీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో విజయవాడ ఏసీబీ కోర్టు దగ్గరకు చేరుకుని చంద్రబాబుకు అనుకూలంగా నినాదాలు చేస్తున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది
ALSOREAD:చంద్రబాబు కేసుపై కోర్టులో ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్
భారీగా మోహరించిన పారా మిలిటరీ బలగాలు కోర్టు పరిసరాలను ఖాళీ చేస్తున్నారు. కోర్టు పలువురు కార్యకర్తలను అదుపులోకి తీసుకుని తరలిస్తున్నారు. కోర్టు నుంచి 500 మీటర్ల మేర పోలీసులు, భద్రత సిబ్బంది మినహా ఇతరుకు అనుమతివ్వడం లేదు. ఎక్కడిక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు. చంద్రబాబు కేసుపై ఇరు వర్గాల వాదనలు విన్న ఏసీబీ కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.