మూన్ మిషన్ చంద్రయాన్-3 లాంచ్కు సిద్ధమైంది. జూలై 12- నుంచి జులై19 మధ్య ఏపీలోని శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఇస్రో శాస్త్రవేత్తలు దీనిని ప్రయోగించనున్నారు. ఈ మేరకు ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ తెలిపారు. అన్ని పరీక్షలు పూర్తయిన తర్వాత ఖచ్చితమైన తేదీని ప్రకటిస్తామన్నారు. ప్రస్తుతం చంద్రయాన్-3ను స్పేస్క్రాఫ్ట్కు పూర్తిగా అనుసంధించామనిచెప్పారు. ఈ పరీక్షలను కూడా పూర్తి చేశామన్నారు. పరిస్థితులు అనుకూలిస్తే జూలై 13 మధ్యాహ్నం 2.30 గంటలకు చంద్రయాన్-3 నింగిలోకి వెళ్తుందన్నారు.
చంద్రయాన్-3 మిషన్ను అత్యంత బరువైన రాకెట్. జియోసింక్రోనస్ లాంచ్ వెహికల్ మార్క్-III ద్వారా దీన్ని ప్రయోగించనున్నారు. స్వదేశీ ల్యాండర్ మాడ్యూల్, ప్రొపల్షన్ మాడ్యూల్ తోపాటు చంద్రుడిపైకి దించే రోవర్ను పంపుతారు. 2019లో చేపట్టిన చంద్రయాన్-2 మిషన్లో చంద్రుడి ఉపరితలంపై రోవర్ క్రాష్ ల్యాండ్ అయింది. ఈ నేపథ్యంలో నాలుగేళ్ల తర్వాత రూ.615 కోట్ల వ్యయంతో చంద్రయాన్-3 చేపడుతున్నారు. ఈ మిషన్ ద్వారా చంద్రుడిపై రోవర్ను సురక్షితంగా ల్యాండ్ చేయనున్నారు. చంద్రుడి ఉపరితలానికి సంబంధించిన పలు పరిశోధనలు చేపట్టనున్నారు. తద్వారా ఈ ఘనత సాధించిన నాల్గవ దేశంగా భారత్ నిలువనుంది