- గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నిర్ణయం
హైదరాబాద్, వెలుగు: ఇంటర్సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్మారింది. పరీక్షా తేదీలను పూర్తిగా ఇంటర్ బోర్డు రివైజ్ చేసింది. మే 27న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పరీక్షల షెడ్యూల్ ను మారుస్తూ ఇంటర్ బోర్డు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా ప్రకటించిన షెడ్యూల్ప్రకారం ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ సప్లిమెంటరీ పరీక్షలను మే 24 నుంచి జూన్ 3 వరకు నిర్వహించనున్నట్టు బోర్డు పేర్కొంది. ఫస్టియర్ పరీక్షలను ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, సెకండియర్ పరీక్షలను మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహించనుంది. ప్రాక్టీకల్ పరీక్షలు జూన్ 4 నుంచి 8 వరకు నిర్వహించనున్నారు. ఎన్విరాన్ మెంట్ ఎడ్యుకేషన్ ఎగ్జామినేషన్ (జూన్ 11), ఎథిక్స్, హ్యుమన్ వాల్యూస్ ఎగ్జామినేషన్ (జూన్ 12) తేదీల్లో ఎలాంటి మార్పులు చేయలేదు.