ఇంటర్​ సప్లిమెంటరీ ఎగ్జామ్స్​ తేదీల్లో మార్పు

ఇంటర్​ సప్లిమెంటరీ ఎగ్జామ్స్​ తేదీల్లో మార్పు
  • గ్రాడ్యుయేట్​ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నిర్ణయం

హైదరాబాద్​, వెలుగు: ఇంటర్​సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్​మారింది. పరీక్షా తేదీలను పూర్తిగా ఇంటర్​ బోర్డు రివైజ్​ చేసింది. మే 27న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పరీక్షల షెడ్యూల్ ను మారుస్తూ ఇంటర్ బోర్డు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా ప్రకటించిన షెడ్యూల్​ప్రకారం ఇంటర్​ ఫస్టియర్, సెకండియర్​ సప్లిమెంటరీ పరీక్షలను మే 24 నుంచి జూన్​ 3 వరకు నిర్వహించనున్నట్టు బోర్డు పేర్కొంది. ఫస్టియర్ పరీక్షలను ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, సెకండియర్​ పరీక్షలను మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహించనుంది. ప్రాక్టీకల్ పరీక్షలు జూన్ 4 నుంచి 8 వరకు నిర్వహించనున్నారు. ఎన్విరాన్ మెంట్ ఎడ్యుకేషన్ ఎగ్జామినేషన్ (జూన్ 11), ఎథిక్స్, హ్యుమన్ వాల్యూస్ ఎగ్జామినేషన్ (జూన్ 12) తేదీల్లో ఎలాంటి మార్పులు చేయలేదు.