
నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం అల్జాపూర్ లో ఫారెస్ట్ అధికారులు ఏర్పాటు చేసిన బోన్లో చిరుత చిక్కింది. ఐదు రోజుల క్రితం చిరుతను చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఫారెస్ట్ అధికారులు, పోలీసులు చిరుత అడుగులు గుర్తించి బోను ఏర్పాటు చేశారు. శనివారం రాత్రి చిరుత బోనులో చిక్కింది. ఫారెస్ట్ అధికారులు చిరుతను హైదరాబాద్లోని జూపార్క్కు తరలించారు. ఈ ప్రాంతంలో మరో చిరుత సంచరిస్తోందని గ్రామస్తులు చెబుతున్నారు.