తమ కంటే ముందు ఫుడ్ ఆర్డర్ డెలివరీ చేశారని కొడవళ్లతో దాడి

తమ కంటే ముందు ఫుడ్ ఆర్డర్ డెలివరీ చేశారని కొడవళ్లతో దాడి

బిర్యానీ కోసం మద్యం మత్తులో జరిగిన ఘర్షణలో 22 ఏళ్ల యువకుడిని ఓ ముఠా హత్య చేసింది. మృతుడు బాలాజీ అనే వ్యక్తి అని పోలీసులు వెల్లడించారు. అతను చెన్నైలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తూ తన స్నేహితులతో కలిసి మన్నూర్‌పేట బస్టాప్‌ సమీపంలో రాత్రి భోజనం చేసేందుకు వెళ్లాడు. అక్కడ బాలాజీ, అతని స్నేహితులు బిర్యానీని ఆర్డర్ చేశారు. అదే దుకాణం నుంచి డిష్ ఆర్డర్ చేసిన మరో ముగ్గురు తాగుబోతులు.. దుకాణం యజమాని మొదట బాలాజీ అండ్ అతని ఫ్రెండ్స్ కు ఆహారాన్ని అందించడంతో అతనితో గొడవ పడ్డారు. దీంతో వాగ్వాదం పెరిగి మద్యం మత్తులో ఉన్న ముగ్గురు వ్యక్తులు బాలాజీపై కొడవళ్లతో దాడి చేశారు.

ALSO READ ఉల్లిపాయలు తినకపోతే చస్తారా.. 10 లక్షల కారు కొంటారు 10 రూపాయలు పెట్టలేరా..

ఈ ఘటన మొత్తం అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. ఆగస్టు 19న ఈ ఘటన చోటుచేసుకుంది. బాలాజీని స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించగా, అప్పటికే అతను చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన చెన్నై పోలీసులు తదుపరి విచారణ జరుపుతున్నారు.