ఆడబిడ్డకు జన్మనిచ్చిన చెన్నకేశవులు భార్య

ఆడబిడ్డకు జన్మనిచ్చిన చెన్నకేశవులు భార్య

దిశ కేసు ఎన్ కౌంటర్లో మృతి చెందిన మహబూబ్ నగర్ మక్తల్మండలం గుడిగండ్ల గ్రామానికి చెందిన చెన్నకేశవులు భార్య ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. దిశ కేసులో ఎన్ కౌంటర్ అయ్యే సమయానికి చెన్నకేశవులు భార్య రేణుక గర్భిణిగా ఉంది.  శుక్రవారం సాయంత్రం  పురిటి నొప్పులు రావడంతో మహబూబ్ నగర్ జనరల్ ఆస్పత్రిలో చేర్పించగా ఆడబిడ్డకు జన్మనిచ్చింది.