
చెన్నూర్ నియోజకవర్గంలోని కోటపల్లి మండలంలో పర్యటించారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. కోటపల్లి మండలంలోని రాజారం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ పాత్రలను పంపిణి చేశారు వివేక్ వెంకటస్వామి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేక్ కు ఘనంగా స్వగతం పలికారు గ్రామస్తులు. బాణాసంచా కాల్చి డప్పు సప్పుల్లతో స్వగతం పలికారు రాజారాం గ్రామస్తులు. గ్రామంలో అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇండ్ల లాబీదరులకు ప్రొసీడింగ్ పాత్రలను అందజేశారు ఎమ్మెల్యే వివేక్.
ఈ సందర్భంగా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే వివేక్. ఎన్నికల్లో ఇచిన మాట ప్రకారం ఇందిరమ్మ ఇండ్లను ఇవ్వడం జరుగుతుందని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ ఒకరికి డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వలేదని.. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన లక్ష కోట్ల రూపాయలతో ప్రతీ ఒక్కరికీ ఇల్లు వస్తుండేనని అన్నారు వివేక్ వెంకటస్వామి.
►ALSO READ | ములుగులో ప్రభుత్వ గుర్తింపు ఉన్న కేంద్రాల్లోనే విత్తనాలు కొనాలి
ప్రతీ ఒక్కరూ నిబంధనల ప్రకారం ఇండ్లు కట్టుకోవాలని.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం ప్రతీ ఒక్కరికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 లకే గ్యాస్ సిలెండర్ ఇస్తున్నామని అన్నారు.ప్రతీ ఒక్కరికీ సన్న బియ్యం రేషన్ బియ్యం ఇవ్వడం జరుగుతుందని అన్నారు ఎమ్మెల్యే వివేక్.