
గోదావరిఖని, వెలుగు: చెన్నూర్ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి–సరోజన దంపతుల పెళ్లిరోజు సందర్భంగా శుక్రవారం గోదావరిఖనిలోని అమ్మపరివార్ అనాథ పిల్లల ఆశ్రమంలో వేడుకలు నిర్వహించారు. ఈసందర్భంగా అనాథ పిల్లలకు పండ్లు, బ్రెడ్, బిస్కట్స్, స్వీట్స్, పౌష్టికాహరం అందించడంతోపాటు అన్నదానం చేశారు. కాంగ్రెస్ లీడర్లు కామ విజయ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా సీనియర్ లీడర్ పి.మల్లికార్జున్హాజరై కేక్కట్ చేశారు.
అనంతరం వివేక్–సరోజనలకు వివాహ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో లీడర్లు తిప్పారపు మధు, కోరం నరేందర్ రెడ్డి, రఫీక్, ముచ్చకుర్తి మహేశ్, సర్దార్, అఖిల్, చారి, దినేశ్, శ్రీనివాస్, విజయ్, రాజు, కళ్యాణ్, కుమార్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. రామగుండం పట్టణంలోని తబితా ఆనాథ పిల్లల ఆశ్రమంలో దక్షిణ మధ్య రైల్వే యూజర్స్కమిటీ మెంబర్ అనుమాన శ్రీనివాస్ ఆధ్వర్యంలో పండ్ల పంపిణీ చేశారు. అన్నదానం నిర్వహించారు.