కాంగ్రెస్ విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుంది: వివేక్ వెంకటస్వామి

కాంగ్రెస్ విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుంది: వివేక్ వెంకటస్వామి

కాంగ్రెస్ పార్టీ విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి.  గత ప్రభుత్వం విద్యను నిర్లక్ష్యం చేసిందన్నారు. బడ్జెట్ లో కేవలం 6 శాతం మాత్రమే  నిధులు మంజూరు చేసిందని విమర్శించారు. మంచిర్యాల జిల్లా భీమారంలో మండల  విద్యావనరుల కేంద్రాన్ని ప్రారంభించారు వివేక్ వెంకటస్వామి. ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన.. చెన్నూరు నియోజకవర్గంలోని చాలా పాఠశాలల్లో గదులు, వసతులు లేవన్నారు. అన్ని పాఠశాలల్లో త్వరలోనే వసతులు కల్పిస్తామన్నారు. చెన్నూరు నియోజకవర్గంలో స్కిల్ డెవ్ లప్ మెంట్ సెంటర్ ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. పవర్ ప్లాంటులో 80 శాతం ఉద్యోగాలు స్థానికులకే వచ్చేలా సీఎంతో మాట్లాడి సర్క్యులర్ తెచ్చుకున్నామన్నారు. 

ప్రారంభోత్వవం అనంతరం ..  భీమారం రామాలయం, జైపూర్ ఆంజనేయస్వామి ఆలయాలను ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి దర్శించుకున్నారు. అయోధ్యలో రామ మందిర విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా ఆలయాలల్లో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పూజలు చేశారు.  

పనుల్లో స్పీడ్ పెంచండి

 జైపూర్ మండలం పెగడపల్లి వాగు పై నిర్మిస్తున్న బ్రిడ్జి పనులను అధికారులతో కలిసి పరిశీలించారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఆలస్యం చేయకుండా నిర్ణీత సమయంలో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.