- ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు
చేవెళ్ల, వెలుగు : ఆటోలో గంజాయిని తరలిస్తుండగా చేవెళ్ల పోలీసులు పట్టుకుని ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఎస్ఐ ప్రదీప్ కుమార్ తెలిపిన ప్రకారం.. యూపీకి చెందిన రాజ్ కుమార్, బిహార్ కు చెందిన దిలీప్కుమార్ సిటీలో ఉంటూ గంజాయిని అక్రమంగా తరలిస్తున్నారు.
శనివారం చేవెళ్లలో పోలీసుల తనిఖీల్లో భాగంగా షాద్నగర్ నుంచి చేవెళ్ల వైపు వెళ్లే ఆటోను ఆపి చెక్ చేయగా కిలో గంజాయి లభించింది. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని గంజాయిని సీజ్ చేసినట్టు చేవెళ్ల ఎస్ ఐ ప్రదీప్ కుమార్ తెలిపారు.