చెరువులో స్నానానికి వెళ్లి ఏడుగురు పిల్లలు మృతి

చెరువులో స్నానానికి వెళ్లి ఏడుగురు పిల్లలు మృతి

చెరువులో సరదాగా ఈతకు వెళ్లిన ఏడుగురు చిన్నారులు నీటిలో మునిగి చనిపోయారు. ఈ విషాద సంఘటన బీహర్ లోని చాప్రా జిల్లాలో జరిగింది. ఆదివారం సెలవు రోజు కావడంతో చాప్రాలోని ఇసుపూర్ కు చెందిన ఏడుగురు పిల్లలు స్నానం కోసమని సమీప చెరువుకు వెళ్లారు. భారీ వర్షాల కారణంగా చెరువు నిండిపోవడం, చెరువు లోతు గురించి తెలియక పోవడం వల్ల ఆ ఏడుగురు పిల్లలు అందులో పడి గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు గల్లంతైన వారిని  ఈతగాళ్ల సాయంతో బయటకు తీశారు. వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఇసుపూర్ ఆసుపత్రికి తరలించారు. ఒకే ప్రాంతానికి చెందిన ఏడుగురు పిల్లలు  చనిపోవడంతో వారి తల్లిదండ్రులు తీవ్ర విషాదం లో మునిగిపోయారు.