గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిరుద్యోగులకు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ గుడ్ న్యూస్ చెప్పారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి నిరుద్యోగ యవకులకు ప్రతి నెల నిరుద్యోగ భృతిని అందిస్తామని ప్రకటించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ క్రమంగా నెరవేరుస్తున్నామని భూపేష్ చెప్పారు. లాల్బాగ్ పరేడ్ మైదానంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన భూపేష్ నిరుద్యోగ భృతి ప్రకటన చేశారు.
అయితే నిరుద్యోగ భృతికి ఉండాల్సిన అర్హతలేంటి? ప్రతి నెల ఎంత ఇస్తారు? ఇలా ఎంత మందికి, ఎన్ని నెలలు ఇస్తారు? అనే విషయాలుపై మాత్రం భూపేష్ బఘెల్ స్పష్టత ఇవ్వలేదు. 2018 అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలలో ఇది ఒకటి. కాగా ఈ ఏడాది చివర్లో ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.