చికెన్ బాగోలేదని కొట్లాట.. ఓనర్‌‌పై యాసిడ్ దాడి

చికెన్ బాగోలేదని కొట్లాట.. ఓనర్‌‌పై యాసిడ్ దాడి

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ సమీపంలోని తిప్పపూర్‌‌లో దారుణం జరిగింది. చికెన్ కొనుగులు విషయంలో ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. ఈ ఘర్షణలో చికెన్ సెంటర్ యజమానిపై, అడ్డు వచ్చిన వారిపైనా పూసల వ్యాపారులు యాసిడి దాడి చేశారు. కొంతకాలం నుంచి రాజన్న అలయ ప్రాంతంలో పూసల వ్యాపారం చేస్తున్న వారు.. చికెన్ కోసం తిప్పాపూర్ వెళ్లారు. కిలో కొనుగోలు చేసి వెళ్లి పోయారు. మళ్లీ రాత్రి వచ్చి చికెన్ బాగాలేదని వాగ్వాదానికి దిగారు. చికెన్ సెంటర్ యజమానిపై దాడికి దిగారు. అక్కడే ఉన్న కొందరు చికెన్ సెంటర్ యజమానికి సపోర్టుగా వెళ్లారు. ఇరువర్గాల మధ్య కొట్లాట జరిగింది. దీంతో పూసల వ్యాపారులు చికెన్ సెంటర్ యజమానితో పాటు మరో 8 మందిపై యాసిడ్ దాడి చేసి పారిపోయారు. బాధితుల్ని ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తల కోసం..

ఎన్నికల ముందు కేసీఆర్​ బయోపిక్

ఆగస్టు 15న ప్రతి ఇంటిపై జెండా ఎగరాలె

ఆ పోస్టులన్నీ కావాలని డిలీట్ చేయలేదు