గద్వాల, వెలుగు : జమ్మూ కాశ్మీర్ విముక్తి కోసం, నూతన విద్యా విధానం కోసం, రామ్ మందిర్ నిర్మాణం కోసం ఏబీవీపీ కృషి చేసిందని కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. గురువారం జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ప్యారడైజ్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన ఏబీవీపీ 40వ మహాసభలకు కిషన్ రెడ్డితో పాటు బీజేపీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ డీకే అరుణ చీఫ్గెస్ట్లుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కిషన్రెడ్డి మాట్లాడుతూ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కలను ప్రధాని నరేంద్ర మోడీ నెరవేర్చారన్నారు. ఆగస్ట్ 15న ప్రతి భారతీయుడి ఇంటిపైన మువ్వన్నెల జెండా ఎగురవేయాలని కోరారు. డీకే అరుణ మాట్లాడుతూ విద్యారంగ సమస్యలపై ఏబీవీపీ పోరాటాన్ని ప్రశంసించారు. ఈ సందర్భంగా రాజమాత ఫౌండేషన్ ఫౌండర్ ఉదయ్ కుమార్ రెడ్డికి జనమంచిలి గౌరీ యువ పురస్కార్ అవార్డు అందజేశారు. బీజేపీ లీడర్లు జితేందర్ రెడ్డి, బంగారు శ్రుతి, శాంతకుమార్, 33 జిల్లాల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఫండ్స్ ఇచ్చినా ఉపయోగించుకోవడం లేదు
మహాసభల తర్వాత జోగులాంబ టెంపుల్ కు వెళ్లిన మంత్రి అమ్మవారిని దర్శించుకున్నారు. రెవెన్యూ, టూరిజం శాఖ ఆఫీసర్లతో సమీక్ష నిర్వహించారు. తర్వాత మాట్లాడుతూ కేంద్ర టూరిజం శాఖ తరపున టెంపుల్ కోసం రూ.36 కోట్ల 73 లక్షలు మంజూరు చేశామన్నారు. అందులో ఇప్పటికే రూ.ఐదు కోట్లు రిలీజ్ చేశామని, ఇవి 2018కి సంబంధించిన ఫండ్స్ మాత్రమే అని అన్నారు. వాటిని ఇప్పటి వరకూ ఉపయోగించుకోలేదన్నారు. అలాగే టెంపుల్ ఇన్సైడ్ డెవలప్మెంట్ కోసం రూ.3 కోట్ల 70 లక్షలు ఇచ్చామని, వాటితో కలరింగ్, ఎలక్ట్రికల్, ఇతర పనులు చేయాలన్నారు. ప్రసాద్ స్కీం కింద మరో రూ.36 కోట్ల 70 లక్షలను కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని, ఈ ఫండ్స్తో బస్టాండ్ నిర్మాణం, నిత్యాన్నదాన భవనం, 21 టూరిజం రూమ్స్ ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. ఫండ్స్ ఉన్నప్పటికీ రాష్ట్ర టూరిజం శాఖ లేట్ చేస్తోందని విమర్శించారు. మరొకసారి రెవెన్యూ టూరిజం శాఖ ఆఫీసర్లతో హైదరాబాద్లో రివ్యూ మీటింగ్ నిర్వహించి పనులు ఫాస్ట్ గా జరిగేలా చూస్తామన్నారు. ఇక్కడ రాజకీయాలు మాట్లాడడానికి రాలేదని, కేవలం డెవలప్మెంట్ పైనే దృష్టి పెట్టడం జరుగుతుందన్నారు. సాధ్యమైనంత తొందరగా టెంపుల్ డెవలప్మెంట్ చేసేందుకు కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ కృషి చేస్తుందన్నారు.
ఈటల గెలుపు జీర్ణంచుకోలేకే..
కొత్తకోట : కల్వకుంట్ల కుటుంబ రాజకీయం కోసం తెలంగాణ రాష్ట్రాన్ని బలిపశువును చేయొద్దని కిషన్ రెడ్డి కోరారు. కొత్తకోటలో మాజీ ఎమ్మెల్యే రావుల రవీంద్రనాథ్రెడ్డి ఇంట్లో కిషన్రెడ్డి మాట్లాడుతూ హుజూరాబాద్ఎన్నికల్లో ఈటల గెలుపుతో కేసీఆర్కు ఓటమి భయం పట్టుకుందన్నారు. రాష్ర్టంలో అన్నదాతల నుంచి బీజేపీకి వస్తున్న ఆదరణను తట్టుకోలేకే ధాన్యం కొనడం లేదని తమ పార్టీపై విష ప్రచారం చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో చేసుకున్న అగ్రిమెంట్ప్రకారం వచ్చిన ధాన్యాన్ని కేంద్రం కొంటుందన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎద్దుల రాజవర్ధన్ రెడ్డి, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు ఎద్దుల శ్రీనివాస్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.