ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలం: వేం నరేందర్​రెడ్డి

ఉద్యోగుల సమస్యలపై  ప్రభుత్వం సానుకూలం: వేం నరేందర్​రెడ్డి
  • ఉద్యోగ సంఘాలకు వేం నరేందర్​రెడ్డి హామీ 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు సీఎం ముఖ్య సలహాదారు వేం నరేందర్​ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం నరేందర్ రెడ్డిని గచ్చిబౌలిలోని అయన నివాసంలో  తెలంగాణ గెజిటెడ్​అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు నాయకత్వంలో ని ప్రతినిధి  బృంధం కలిసింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ఉద్యోగుల సమస్యలపై వేం నరేందర్​ రెడ్డి సానుకూలంగా స్పందించారని చెప్పారు. 

ఆగస్టు మూడో వారంలో ఉద్యోగుల పెండింగ్ అంశాలపై నిర్ణయం తీసుకుంటామని వేం నరేందర్​ రెడ్డి చెప్పినట్లు వివరించారు. సమావేశంలో  టీజీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  ఏ.సత్యనారాయణ , ట్రెజరర్  ఉపేందర్ రెడ్డి , అసోసియేట్ అధ్యక్షుడు  బి.శ్యామ్ , నాయకులు నరహరి రావు , వనజ, రామకృష్ణ  గౌడ్ , టీఎన్​జీఓ రాష్ట్ర ప్రధాన  కార్యదర్శి ముజీబ్ హుస్సేనీ  తదితరులు  పాల్గొన్నారు .