
- ఉద్యోగ సంఘాలకు వేం నరేందర్రెడ్డి హామీ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు సీఎం ముఖ్య సలహాదారు వేం నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం నరేందర్ రెడ్డిని గచ్చిబౌలిలోని అయన నివాసంలో తెలంగాణ గెజిటెడ్అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు నాయకత్వంలో ని ప్రతినిధి బృంధం కలిసింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ఉద్యోగుల సమస్యలపై వేం నరేందర్ రెడ్డి సానుకూలంగా స్పందించారని చెప్పారు.
ఆగస్టు మూడో వారంలో ఉద్యోగుల పెండింగ్ అంశాలపై నిర్ణయం తీసుకుంటామని వేం నరేందర్ రెడ్డి చెప్పినట్లు వివరించారు. సమావేశంలో టీజీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ.సత్యనారాయణ , ట్రెజరర్ ఉపేందర్ రెడ్డి , అసోసియేట్ అధ్యక్షుడు బి.శ్యామ్ , నాయకులు నరహరి రావు , వనజ, రామకృష్ణ గౌడ్ , టీఎన్జీఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముజీబ్ హుస్సేనీ తదితరులు పాల్గొన్నారు .