గాంధీలో నకిలీ నర్సు.. పోలీసులకు  అప్పగించిన చీఫ్ మెడికల్ ఆఫీసర్

గాంధీలో నకిలీ నర్సు.. పోలీసులకు  అప్పగించిన చీఫ్ మెడికల్ ఆఫీసర్

పద్మారావునగర్, వెలుగు: గాంధీ హాస్పిటల్​లో నకిలీ నర్సును గుర్తించిన చీఫ్ మెడికల్ ఆఫీసర్(సీఎంవో) ఆమెను పోలీసులకు అప్పగించారు. బుధవారం రాత్రి ఎమర్జెన్సీ బ్లాక్​లో ఓ పేషెంట్​దగ్గరికి వెళ్లి వస్తున్న నర్సును చూసి అనుమానించిన సీఎంవో ఆమెను విచారించారు.  ఆమె నర్సు కాదని.. ఆ యువతి(25) వద్ద  రేష్మ(25) పేరుతో గాంధీ హాస్పిటల్ ఫేక్ ఐడీ కార్డు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే చిలకలగూడ పోలీసులకు ఆమెను అప్పగించారు. అయితే, పోలీసుల ముందే  ఆ యువతి బట్టలు విప్పేందుకు ప్రయత్నించి హల్​చల్​ చేసింది.

దీంతో ఆ యువతి మానసిక వ్యాధితో బాధపడుతున్నట్లు భావించిన పోలీసులు ఆమె ఉంటున్న లేడీస్ ​హాస్టల్​కు తరలించారు. అయితే అక్కడి నుంచి ఆమె పారిపోయినట్లు సమాచారం. ఇదిలా ఉంటే, రెండ్రోజుల కిందట హాస్పిటల్​లోని ఓపీ బ్లాక్​ పై అంతస్తులో ఉన్న  పీజీ మహిళా స్టూడెంట్స్​ హాస్టల్​లోకి ఓ యువతి ప్రవేశించి తాను పీజీ డాక్టర్ ​అని చెప్పుకొని హల్​చల్​ చేసింది. అనుమానం వచ్చిన హాస్టల్​ ఇన్​చార్జి విచారించగా.. ఆమె పీజీ డాక్టర్​ కాదని తేలింది. పేషెంట్ల ఆందోళన  ఫేక్​ మెడికల్ ​స్టాఫ్​ ఉదంతాలు బయటపడుతుండటంతో    పేషెంట్లు ఆందోళనకు గురవుతున్నారు. ఎవరో  వచ్చివైద్యం చేసి వెళ్తే  తమ పరిస్థితేంటని ప్రశ్నిస్తున్నారు. సెక్యూరిటీ టైట్ ​చేసి, నాణ్యమైన వైద్యం అందించాలని కోరుతున్నారు.