చిక్కడపల్లి డిటెక్టివ్ మాజీ ఇన్స్పెక్టర్ అరెస్ట్

చిక్కడపల్లి డిటెక్టివ్ మాజీ ఇన్స్పెక్టర్ అరెస్ట్

హైదరాబాద్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ డిటెక్టివ్ మాజీ ఇన్స్పెక్టర్ ప్రసాద్ ను పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్ కు తరలించారు. రియల్ ఎస్టేట్ వ్యవహారంలో ఇద్దరు వ్యక్తులను కిడ్నాప్ చేసి.. దాడి చేశారని ప్రసాద్ పై కేసు నమోదైంది. రెండు రోజుల క్రితం జరిగిన ఈ సంఘటనపై చిక్కడపల్లి పోలీసులు చర్యలు తీసుకున్నారు. రియల్ ఎస్టేట్ వ్యవహారంలో ప్రసాద్ తలదూర్చడంతో ఆయనపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతానికి వీఆర్ లో ఉన్న ప్రసాద్ ని అరెస్ట్ చేశారు. 

అసలేం జరిగింది..?  

చిక్కడపల్లి సీఐ సీతయ్య తెలిపిన వివరాల ప్రకారం...  రియల్ ఎస్టేట్ వ్యాపారి రాజు అనే వ్యక్తికి మాజీ డీఐ ప్రసాద్ డబ్బులు ఇచ్చారు. కంపెనీ రిజిస్ట్రేషన్​లో తన అన్న శేఖర్ పేరు పెట్టాలని సూచించాడు. రాజు మరో పేరుతో కంపెనీ రిజిస్ట్రేషన్ చేశాడు. దీంతో  తను చెప్పిన పేరు పెట్టకపోవడం, డబ్బులు తిరిగి ఇవ్వనందుకు ప్రసాద్ ఆగ్రహించి రాజుపై దాడి చేశాడు. దీంతో బాధితుడి ఫిర్యాదుతో ప్రసాద్​పై కేసు నమోదు చేశారు పోలీసులు.