ఢిల్లీలో బీజేపీ పెద్ద లీడర్లతో.. చికోటి ప్రవీణ్ మీటింగ్స్

ఢిల్లీలో  బీజేపీ పెద్ద లీడర్లతో.. చికోటి ప్రవీణ్ మీటింగ్స్

క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్ మరోసారి వార్తల్లోకెక్కారు. ఇప్పటికే  క్యాసినో కేసులో ఈడీ విచారణను ఎదుర్కొన్న చికోటి.. ఇటీవల అనుమతులు లేకుండా గన్స్​ క్యారీ చేశారన్న కేసులో  ముందస్తు  బెయిల్ పై బయటకు వచ్చారు. లేటెస్ట్ గా   ఢిల్లీలో బీజేపీ ముఖ్య నేతలను కలవడం హాట్ టాపిక్ గా మారింది. ఇవాళ  ఢిల్లీలో బండి సంజయ్, డీకే అరుణను, జయసుధను కలిశారు చికోటి. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చికోటి ప్రవీణ్   త్వరలో  బీజేపీలో చేరేందుకు  కలుస్తున్నారని ప్రచారం జరుగుతోంది.

బోనాల పండుగలో గన్ మెన్ లతో హల్ చల్ 

ఇటీవల చికోటి ప్రవీణ్ ప్రైవేట్ గన్‌మెన్లతో లాల్ దర్వాజ సింహవాహని అమ్మవారి బోనాలకు వెళ్లారు. వాళ్ల దగ్గర వెపన్స్ ఉండటంతో.. చికోటి ప్రైవేట్ సెక్యూరిటీని పోలీసులు అడ్డుకున్నారు.  వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. లైసెన్స్‌లు రెన్యూవల్‌ చేయకుండా గన్‌లు వాడుతున్నారన్న ఆరోపణలతో నిందితులపై కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం  ప్రవీణ్‌ను ఈ కేసులో ఏ1గా మార్చారు. ఆయన ముగ్గురు గన్‌మెన్‌లు రమేష్‌గౌడ్‌, సుందర్‌నాయక్‌, రాకేష్‌కుమార్‌లను రిమాండ్‌కు తరలించి వారి నుంచి గన్స్​ స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో   ప్రవీణ్​కి ముందస్తు బెయిల్​ మంజూరు చేస్తూ నాంపల్లి కోర్టు జులై 26న తీర్పునిచ్చింది.