అంగన్​వాడీలో కెమికల్ ​తాగి చిన్నారి మృతి

అంగన్​వాడీలో కెమికల్ ​తాగి చిన్నారి మృతి

పిట్లం, వెలుగు: టాయిలెట్స్​ను శుభ్రం చేసే కెమికల్ ​తాగి ఓ చిన్నారి మృతిచెందింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా మద్నూర్​ మండలం రాచూర్​ అంగన్​వాడీలో శనివారం మధ్యాహ్నం ఆదిత్య(5) కెమికల్​తాగి అస్వస్థతకు గురైంది. వెంటనే పాపను మహారాష్ట్ర దెగ్లూర్​ హాస్పిటల్​కు తీసుకెళ్లారు. అక్కడి నుంచి నిజామాబాద్​కు తరలిస్తుండగా దారిలో మృతిచెందింది. చిన్నారులకు అందుబాటులో నిర్లక్ష్యంగా కెమికల్​ను ఉంచిన టీచర్​పై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ ​చేశారు.

see more news

షిప్‌లో రేవ్ పార్టీ.. ప్రముఖ హీరో కొడుకు అరెస్ట్!

40 వేల మందికి పర్మినెంట్‌గా వర్క్‌ ఫ్రమ్ హోమ్‌