పిట్లం, వెలుగు: టాయిలెట్స్ను శుభ్రం చేసే కెమికల్ తాగి ఓ చిన్నారి మృతిచెందింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం రాచూర్ అంగన్వాడీలో శనివారం మధ్యాహ్నం ఆదిత్య(5) కెమికల్తాగి అస్వస్థతకు గురైంది. వెంటనే పాపను మహారాష్ట్ర దెగ్లూర్ హాస్పిటల్కు తీసుకెళ్లారు. అక్కడి నుంచి నిజామాబాద్కు తరలిస్తుండగా దారిలో మృతిచెందింది. చిన్నారులకు అందుబాటులో నిర్లక్ష్యంగా కెమికల్ను ఉంచిన టీచర్పై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.
see more news