విషాదం..చెట్టు కొమ్మ విరిగి పడి నిద్రలోనే చిన్నారి మృతి

విషాదం..చెట్టు కొమ్మ విరిగి పడి నిద్రలోనే చిన్నారి మృతి

హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం నందనం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. చెట్టుకొమ్మ విరిగిపడి నిద్రలోనే తొమ్మిదేళ్ల చిన్నారి మృతి చెందింది. గ్రామంలోని కన్న రజిత సురేందర్ లకు ఓ కుమారుడు కుమార్తె ఉన్నారు.  తొమ్మిదేళ్ల కూతురు శ్రీజ ఇంటి ముందు వేప చెట్టు కింద మంచంపై పడుకుంది. ఇవాళ తెల్లవారుజామున అకస్మాత్తుగా వేపచెట్టు నుండి కొమ్మ విరిగి నిద్రపోతున్న  శ్రీజపై పడింది. అక్కడికక్కడే ఆ చిన్నారి ప్రాణాలు విడిచింది. చిన్నారి మృతితో  నందనం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.