
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ సినీ అవార్డులపై ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆయన ట్వీట్ చేశారు. గద్దర్ అవార్డ్సుకు ఎంపికైన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా మెగాస్టార్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
కళాకారులకు రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు నిజంగా ఎంతో విలువైనదని అన్నారు. ఈ గుర్తింపు ప్రతి నటుడు, టెక్నిషియన్కు ఎంతో ప్రేరణనిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. కళాకారులకు అవార్డులు ఇచ్చే అద్భుతమైన సంప్రదాయాన్ని పునరుద్ధరించడం గొప్ప ప్రోత్సాహకమని పేర్కొన్నారు. సీఎం, మంత్రులు, అవార్డుల కమిటీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ALSO READ | Allu Arjun: అల్లు అర్జున్కి గద్దర్ అవార్డు.. తెలంగాణ ప్రభుత్వంపై బన్నీ రియాక్షన్ ఇదే
కాగా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం తెలుగు సినీ పరిశ్రమకు అవార్డులు ప్రకటించింది. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ (పుష్ప 2), ఉత్తమ నటిగా నివేదా థామస్ (35 చిన్న కథ కాదు), ఉత్తమ డైరెక్టర్గా కల్కి ఫేమ్ నాగ్ అశ్విన్ అవార్డ్స్ దక్కించుకున్నారు. వివిధ విభాగాల్లో ప్రతిభ కనబర్చిన నటులకు అవార్డులు ప్రకటించారు. 2025, జూన్ 14న విజేతలకు అవార్డులు ప్రదానం చేయనున్నారు.