ఏపీ సీఎం జగన్ కు ట్వీట్ చేసిన మెగాస్టార్

ఏపీ సీఎం జగన్ కు ట్వీట్ చేసిన మెగాస్టార్

ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి మెగాస్టార్ చిరంజీవి కృతజ్ఞతలు తెలిపారు. ఏపీలో సింగిల్ విండో పద్ధతిన షూటింగ్ లకు అనుమతులిస్తూ ఏపీ ప్రభుత్వం జీవోను విడుదల చేసింది. దానిపై స్పందించిన చిరంజీవి.. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఫోన్ చేశారు. సినీ పరిశ్రమకు మేలు కలిగే నిర్ణయం తీసుకున్నందుకు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. లాక్డౌన్ ముగిసిన తర్వాత సినీ పరిశ్రమ సమస్యలపై చర్చిద్దామని సీఎం జగన్ అన్నారని చిరంజీవి తెలిపారు.

మెగాస్టార్ ట్వీట్ మీకోసం..

‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైస్ జగన్ గారు సినీ పరిశ్రమకి మేలు కలిగే నిర్ణయాలతో పాటు సింగల్ విండో అనుమతుల జీవో విడుదల చేసినందుకు పరిశ్రమ తరుపున వారికి కృతజ్ఞతలు తెలియజేశాను. లాక్డౌన్ ముగిసిన తరువాత పరిశ్రమ సమస్యలపై చర్చించేందుకు కలుద్దామని జగన్ చెప్పారు. అన్ని విభాగాల నుంచి ప్రతినిధులతో త్వరలోనే వారిని కలవటం జరుగుతుంది.

Heartily thank Sri @ysjagan for issuing the GO for the single window system and agreeing to meet soon after the lockdown to discuss film industry issues.’

For More News..

సీఎం మెరుపులెక్క వచ్చి ఏదేదో మాట్లాడిపోతున్నడు

సుద్దాల అశోక్ తేజ ఆపరేషన్ సక్సెస్