విశాఖపట్నంలోని లోకనాయక్ ఫౌండేషన్(Lokanayak Foundation) ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు అభిమాన నటుడు ఎన్టీఆర్ 28వ వర్ధంతి, దాదాసాహెబ్ పురస్కార గ్రహీత ఏఎన్నార్ 100 ఏళ్ల సెంటినరీ సెలబ్రేషన్స్ ఇవాళ (జనవరి 20) ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) అటెండ్ అయ్యారు.
ఈ కార్యక్రమంలో చిరంజీవి తన కెరీర్ బిగెనింగ్లో రామారావు చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకున్నారు..'నేను మంచి ఫామ్లో ఉన్నప్ప్పుడు రామారావు చాలా సలహాలు ఇచ్చేవారని గుర్తు చేసుకున్నారు. అలాగే..ఇపుడు ఇండస్ట్రీలో బాగా అభివృద్ధిలోకి వస్తున్నావు..మనం ఎక్కువ కాలం ఈ స్టార్ స్టేటస్లో ఉంటామని అనుకోలేము..అందుకే సంపాదించే సంపదను ఇనుప ముక్కల మీద పెట్టొద్దు..ఏదైనా మంచి హౌస్ కట్టుకోండి..భూములు మీద పెట్టుబడి పెట్టండి బ్రదర్ అని రామారావు చెప్పేవారు.
ఇప్పుడు రామారావు చెప్పిన ముందుచూపు మాటల వల్ల అక్కడక్కడ భూములు కొన్నట్లు చిరు తెలిపారు. అలాగే..ప్రస్తుతం నాకు వచ్చే రెమ్యూనరేషన్ కంటే అప్పట్లో కొన్న స్థలాలే నన్ను..నా ఫ్యామిలీని కాపాడుతున్నాయనే చిరు మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రస్తుతం చిరు సినిమాల విషయానికి వస్తే..బింబిసారతో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు వశిష్ట(Vassishta)తెరకెక్కిస్తున్న విశ్వంభర (Vishwambhara)మూవీలో నటిస్తున్నాడు. సోషియో ఫాంటసీ ఎలిమెంట్స్ తో రానున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
అలాగే చిరు త్వరలో ఓటీటీలోకి అడుగు పెట్టబోతున్నట్లు సమాచారం. అందుకు చిరంజీవి బలమైన కథ కోసం వెతుకుతున్నారట. కొంతమంది రచయితలకు ఆయన వయసుకు తగిన బలమైన కథ రాయాలని సూచించారట. క్రైమ్ డ్రామా కోసం చిరు ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఎలాంటి కథ రెడీ అవుతుందో చూడాలి.
Also Read : Rashmika Mandanna: రష్మిక మందన్న డీప్ఫేక్ వీడియో..ప్రధాన నిందితుడి అరెస్ట్
N T రామారావు గారు దూరద్రుష్టితో చాలా సలహాలు ఇచ్చారు...
— Gulte (@GulteOfficial) January 20, 2024
కారులు కొందాం అనుకుంటే భూములు మీద పెట్టుబడి పెట్టండి బ్రదర్ అన్నారు...
ఈరోజు నా రెమ్యూనరేషన్ కంటే ఆ స్థలాలే నన్ను.... నా కుటుంబాన్ని కాపాడుతున్నాయ్...
- Megastar #Chiranjeevi pic.twitter.com/rZLL2IeL3p