సీఐపై కానిస్టేబుల్ దాడి.. కత్తితో అటాక్​ చేసి పరార్​

సీఐపై కానిస్టేబుల్ దాడి.. కత్తితో అటాక్​ చేసి పరార్​


మహబూబ్​నగర్ జిల్లా కేంద్రంలో సీఐపై కానిస్టేబుల్ కత్తితో దాడి చేశాడు. స్థానిక సెంట్రల్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో ఇఫ్తార్ అహ్మద్ సీఐగా పనిచేస్తున్నారు. ఆయనపై జిల్లా కేంద్రంలోని ఓ పోలీస్ స్టేషన్ కు చెందిన కానిస్టేబుల్ కత్తితో దాడి చేసి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన సీఐని స్థానికులు ఎస్వీఎస్  హాస్పిటల్ కు తరలించారు. సంఘటనా స్థలాన్ని డీఐజీ చౌహన్, ఎస్పీ హర్షవర్ధన్ చేరుకొని పరిశీలించి, వివరాలను సేకరించారు. వివాహేతర సంబంధం కారణంగానే ఈ ఘటన జరిగినట్లు అనుమానిస్తున్నారు.

ALSO READ : సినీ పరిశ్రమలో మరో విషాదం.. జూనియర్ బాలయ్య మృతి